News

కంపుకు కేసిఆర్‌దే భాద్యత:తమ్మినేని


హైదరాబాద్ నగరంలో కంపునకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బాద్యత వహించాలని తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలు మున్సిపల్ కార్మికులను నిందించరాదని, దీనికి కెసిఆర్ బాద్యత వహించాలని ఆయన అన్నారు.ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్మికుల ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు లేకుండా స్వచ్ భారత్ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.చీపుళ్లు పట్టుకుని ఫోటోలు దిగితే స్వచ్ భారత్ అయిపోతుందా అని ఆయన అన్నారు. కెసిఆర్ తిక్కపనులు చేస్తున్నారని, ఆయన ప్రభుత్వానికి అవసరమైతే ఊడ్చి పారేయడానికి సిద్దంగా ఉండాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు